అమెరికాలో ఓ మహిళకు ఒకే రోజు రెండు లాటరీలు
- November 05, 2017
అమెరికాలో ఓ మహిళకు ఒకే రోజు రెండు లాటరీల్లో భారీగా డబ్బులు వచ్చాయి.ఉత్తర కరోలినాలో ఇటీవల డైమండ్ డ్యాజ్లర్ లాటరీ టికెట్ను కొనుగోలు చేసిన కింబర్లీ మోరిస్.. రూ.6.4లక్షల నగదును గెలుచుకొంది.
ఈ మొత్తాన్ని స్వీకరించిన ఆమె.. వెంటనే రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రూ.1300 వెచ్చించి మరో టికెట్ కొనుగోలు చేశారు. దీనికి రూ.6.47 కోట్ల నగదు బహుమతి తగలడంతో.. ఆమె ఆనందం పదింతలైంది.
విడతలవారీగా కాకుండా ఒకేసారి నగదు మొత్తాన్ని తీసుకోవాలని ఆమె నిర్ణయించుకోవచ్చని భావించి ఆమె రెండో లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసింది... పన్నులు పోనూ రూ.2.5 కోట్లు ఆమె ఖాతాకు చేరాయి. పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటానని తానెప్పుడూ కల కనేదాన్నని.. అందుకే రెండో టికెట్ కొన్నానని కింబర్లీ చెప్పారు.
ఒకేరోజు రెండు లాటరీల్లో ఆమెకు భారీగా డబ్బులు రావడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటుచేసుకొంటాయి.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







