సూపర్‌పాస్ట్ రైలు కి పెరిగిన టికెట్ ధర

- November 06, 2017 , by Maagulf
సూపర్‌పాస్ట్ రైలు కి పెరిగిన టికెట్ ధర

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 మొయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసినట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఈ 48 రైళ్ల టికెట్ల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. స్లీపర్‌ కోచ్‌కు రూ.30, సెకండ్‌, థర్డ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లకు రూ.45, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌కు రూ.75 అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. పెంచిన టికెట్ల ధరలతో రైల్వే శాఖకు రూ.70 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1 తేదీ నుంచి కొత్త టైం టెబుల్ అమల్లోకి వస్తుందని, 48 రైళ్ల వేగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వరకు పెంచినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com