దేశంలో ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు
- November 06, 2017
దేశంలో ప్యారడైజ్ పేపర్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్లు ఎగ్గొట్టేందుకు అడ్డదార్లు తొక్కారంటూ 714 మంది ప్రముఖల పేర్లు బయటకొచ్చాయి. వారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఈ అంశాన్ని చూస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT అధికారులు స్పష్టం చేశారు. ఇందులో CBDT, ఈడీ, రిజర్వ్బ్యాంక్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఈ మల్టీ ఏజెన్సీ గ్రూప్ గతేడాది ఏప్రిల్లో ఏర్పాటైంది. అక్రమ మార్గాల్లో పన్ను ఎగవేశారంటూ పనామా పేపర్స్ బయటకు రావడంతో.. వాటిపై విచారణ జరుపుతోంది. దానికే.. ప్యారడైజ్ పేర్లను అప్పగించారు. మరి, నిజానిజాలను ఎప్పుడు నిగ్గు తేలుస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







