ఇటలీ సముద్ర తీరంలో 26 మంది టీనేజీ అమ్మాయిల మృతదేహాలు

- November 07, 2017 , by Maagulf
ఇటలీ సముద్ర తీరంలో 26 మంది టీనేజీ అమ్మాయిల మృతదేహాలు

మధ్యధర సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇటలీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నైజర్, నైజీరియా దేశాల నుంచి వాళ్లు ఇటలీకి వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టీనేజ్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అయిదుగురు వలసదారులను ఇటలీ పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన అమ్మాయిలు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు ఆ మృతదేహాలకు అటాప్సీ నిర్వహించనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com