అబుదాబీలో రెండు స్కూల్ బస్సుల 'ఢీ'
- November 08, 2017
అబుదాబీలో రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. షేక్ జాయెద్ రోడ్డుపై అల్ సాదా బ్రిడ్జ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బస్సులూ డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ రూమ్కి సమాచారం అందగానే, రెస్క్యూ టీమ్ని అక్కడికి పంపించడం జరిగిందనీ, దెబ్బతిన్న బస్సుల్లోంచి విద్యార్థుల్ని జాగ్రత్తగా బయటకు తీశామని ట్రాఫిక్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తరఫున బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ దాహి అల్ హుమైరి చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్లు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలనీ, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని ఈ సందర్భంగా అల్ హుమైరి సూచించారు
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









