అబుదాబీలో రెండు స్కూల్ బస్సుల 'ఢీ'
- November 08, 2017అబుదాబీలో రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. షేక్ జాయెద్ రోడ్డుపై అల్ సాదా బ్రిడ్జ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బస్సులూ డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ రూమ్కి సమాచారం అందగానే, రెస్క్యూ టీమ్ని అక్కడికి పంపించడం జరిగిందనీ, దెబ్బతిన్న బస్సుల్లోంచి విద్యార్థుల్ని జాగ్రత్తగా బయటకు తీశామని ట్రాఫిక్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తరఫున బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ దాహి అల్ హుమైరి చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్లు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలనీ, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని ఈ సందర్భంగా అల్ హుమైరి సూచించారు
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ