అబుదాబీలో రెండు స్కూల్ బస్సుల 'ఢీ'
- November 08, 2017
అబుదాబీలో రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. షేక్ జాయెద్ రోడ్డుపై అల్ సాదా బ్రిడ్జ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బస్సులూ డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ రూమ్కి సమాచారం అందగానే, రెస్క్యూ టీమ్ని అక్కడికి పంపించడం జరిగిందనీ, దెబ్బతిన్న బస్సుల్లోంచి విద్యార్థుల్ని జాగ్రత్తగా బయటకు తీశామని ట్రాఫిక్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తరఫున బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ దాహి అల్ హుమైరి చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్లు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలనీ, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని ఈ సందర్భంగా అల్ హుమైరి సూచించారు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









