భారతీయులకు ఇల్లు అద్దెకివ్వం అంటున్న బ్రిటన్ వాసులు
- November 09, 2017
వాసనలు వెంటాడే కూరలు వండుకునే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకు ఇవ్వనంటూ భీష్మించుకుని కూర్చున్న బ్రిటన్వాసికి కోర్టులో చుక్కెదురైంది. 69ఏళ్ల ఫెర్జస్ విల్సన్కు ఈశాన్య ఇంగ్లండ్లో వందల కొద్దీ ఇళ్లున్నాయి. భారత్, పాకిస్థాన్లకు చెందిన ఓ వర్ణం ఛాయ కలిగిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వనని సమానత్వం, మానవ హక్కుల కమిషన్ ముందు ఆయన తెగేసిచెప్పారు. దీంతో కేసు మైడ్స్టోన్ కౌంటీ కోర్టుకు ఎక్కింది. అక్కడ విల్సన్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 'ఈయన విధానాలు న్యాయవిరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వాటికి మన సమాజంలో చోటులేదు'అని న్యాయమూర్తి రిచర్డ్ పాల్డెన్ తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకించి వివక్ష చూపాలని చూస్తే.. కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టంచేశారు.
'కూరల వాసన వచ్చే ఇల్లు మాకు వద్దంటూ కొందరు తెగేసి చెబుతున్నారు. దీంతో ఇళ్లను బాగుచేయించేందుకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుబెట్టాల్సి వస్తోంది. అందుకే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకి ఇవ్వనని చెప్పాను'అంటూ తన వాదనను విల్సన్ సమర్థించుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







