దుబాయ్‌లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్

- November 09, 2017 , by Maagulf
దుబాయ్‌లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్న మాజీ కెప్టెన్

ఎంఎస్ ధోనీ దుబాయ్‌లో క్రికెట్ అకాడెమీ ప్రారంభించనున్నాడు. దుబాయ్‌కు చెందిన పసిఫిక్ వెంచర్స్‌తో కలిసి ఆయన ఈ అకాడెమీ ప్రారంభించనున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడెమీ ద్వారా క్రికెట్ నేర్చుకోవాలనుకునే చిన్నారులకు శిక్షణ ఇస్తాడు. యూఏఈ క్రికెట్‌కు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని పసిఫిక్ వెంచర్స్ భావిస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు ఇకపై ధోనీ రెగ్యులర్‌గా దుబాయ్ వెళ్లనున్నాడు. 36 ఏళ్ల ధోనీ ఇప్పటివరకూ 90 టెస్ట్ మ్యాచ్‌లు, 308 వన్డేలు, 83 టి20 మ్యాచ్‌లాడాడు. రెండు ప్రపంచ కప్ ట్రోఫీలు భారత్‌కు అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com