రేయాన్ స్కూల్ విద్యార్థి హత్య కేసులో కీలక మలుపు
- November 10, 2017
హర్యానా : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. 11వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. అతనిని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించినట్లు సిబిఐ పేర్కొంది. స్కూల్ పరీక్షలు, తల్లిదండ్రులతో సమావేశాలను ఆపివేసేందుకే ఆ విద్యార్థి ఈ దురంతానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో బస్సు కండక్టర్ అశోక్ కుమార్ను నిందితుడుగా పేర్కొంటూ గుర్గావ్ పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం విదితమే. కాగా, ఇప్పుడు అశోక్ నేరం చేయలేదని నిర్ధారణ కావడంతో జైలు నుండి విడుదలైన వెంటనే పోలీసులు, స్కూల్ యాజమాన్యంపై కేసును నమోదు చేయనున్నట్లు, అతని తరపు న్యాయవాది మోహిత్ వర్మ తెలిపారు. సిబిఐ తన విచారణలో కొన్ని కీలక అంశాలను పేర్కొంది. ఫోరెనిక్స్ నివేదిక అందించిన సమాచారం ప్రకారం హత్యకు ఒక ఆయుధాన్ని వినియోగించారని తేలింది. దానిని నిందితుడు స్థానిక మార్కెట్లో కొనుగోలు చేశాడని సిబిఐ పేర్కొంది. గుర్గావ్ పోలీసులు కండక్టర్ అశోక్ కుమార్ ఈ హత్య చేసినట్లు పేర్కొనడంతో కేసు తప్పుదోవ పట్టిందని ఆరోపించారు.
ఈ కేసును సిబిఐకి అప్పగించామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించినట్లు గుర్గావ్ పోలీసు అధికారి సందీప్ కెర్వాల్ తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







