బంగ్లాదేశ్లో 30 హిందువుల ఇళ్ళు దగ్ధం
- November 11, 2017బంగ్లాదేశ్లో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగ్పూర్ జిల్లా థాకుర్పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లో అభ్యంతరకరమైన పోస్టు చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. చుట్టుపక్కల ఆరు, ఏడు గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మంది ఆందోళనకారులు థాకుర్పారా గ్రామంలోని హిందువులపై దాడి చేశారు. హిందువులకు చెందిన 30 ఇళ్లను కొల్లగొట్టి వాటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది ఆందోళనాకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రంగ్పూర్-దినాజ్పూర్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని మూసివేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..