'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' బుక్ను ఆవిష్కరించిన కేసీఆర్
- November 11, 2017
ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన 'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' కాఫీ టేబుల్ బుక్ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో శనివారం ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని తైలవర్ణ చిత్రాలతోసహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ, కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 'ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం' పేరుతో తెలంగాణ పోలీస్ కు సంబంధించి నూతనంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, వీడియోఫిల్మ్తోపాటు ఆడియోసిడీని అనురాగ్శర్మ డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







