తెలంగాణలో దళితులకు రవాణా రంగంలో శిక్షణ
- November 11, 2017
వాయు రవాణా రంగంలో దళితులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. జాతీయ పర్యాటక, ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథమ్) అందించే ఎయిర్హోస్టెస్ కోర్సులో వారిని చేర్పించనుంది. ఇందులో చేరేందుకు 200 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకోగా... తొలి బ్యాచ్ కింద వారిలో 50 మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్సీ సహకార ఆర్థిక సంస్థ నిర్ణయించింది. దీని వ్యవధి ఆరు నెలలు. వారానికి రెండ్రోజులు శంషాబాద్ విమానాశ్రయంలో క్షేత్రస్థాయి తర్ఫీదు ఉంటుంది. ఇలాగే... ఈ ఏడాదికి సంబంధించి ఆరు సంస్థల ద్వారా వివిధ ఉపాధి కోర్సులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఇందుకు రూ.169 కోట్ల మేర ఖర్చు చేయనుంది. కొత్తగా చేర్చిన దర్జీ కోర్సు కింద కనీసం పదివేల మందికి కుట్లు, అల్లికలపై శిక్షణ ఇచ్చి... ఆధునిక కుట్టుమిషన్లు అందించాలని యోచిస్తోంది. అపోలో వైద్య సంస్థతోనూ కలిసి పలు కార్యక్రమాలను రూపొందించింది. వీటిల్లో చేరినవారికి వైద్య సంస్థల్లో కొలువులు లభించే అవకాశముంది. జాతీయ నిర్మాణ శిక్షణ సంస్థ 'నాక్' సహకారంతో ఉపాధి ఆధారిత శిక్షణ కోర్సులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కెల్ట్రాన్, ఎంఎస్ఎంఈ తదితర సంస్థలూ ఈ క్రతువులో భాగస్వామ్యమవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







