వచ్చే 48 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
- November 12, 2017
శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడనున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కాగా మధ్య భారతంలో అధికపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష