అన్ని పంచాయతీలకూ భారత్నెట్ రెండో దశ ప్రారంభం నేడు
- November 12, 2017
అన్ని పంచాయతీలకూ బ్రాడ్ బ్యాండ్ సేవల కల్పనే లక్ష్యంకేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడిఅమలుపై ఏపీ, తెలంగాణలతో ఒప్పందాలుదిల్లీ: అన్ని పంచాయతీలకూ హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ను కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్నెట్ ప్రాజెక్టు రెండో దశను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు రూ.34 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇది రెండో దశమాత్రమే కాకుండా తుది దశ అని కూడా తెలిపారు. 2019 మార్చి నాటికి దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాండ్ బ్యాండ్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదనంగా 10 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను వేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్, వైఫై సేవలు అందించే టెలికాం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బాండ్విడ్త్ సౌకర్యం కలిగిస్తామని వివరించారు. టెలికాం కంపెనీలు సెకనుకు 2 మెగాబిట్ల వేగం ఉండేలా డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్టుతెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









