అన్ని పంచాయతీలకూ భారత్నెట్ రెండో దశ ప్రారంభం నేడు
- November 12, 2017
అన్ని పంచాయతీలకూ బ్రాడ్ బ్యాండ్ సేవల కల్పనే లక్ష్యంకేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడిఅమలుపై ఏపీ, తెలంగాణలతో ఒప్పందాలుదిల్లీ: అన్ని పంచాయతీలకూ హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ను కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్నెట్ ప్రాజెక్టు రెండో దశను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు రూ.34 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇది రెండో దశమాత్రమే కాకుండా తుది దశ అని కూడా తెలిపారు. 2019 మార్చి నాటికి దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాండ్ బ్యాండ్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదనంగా 10 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను వేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్, వైఫై సేవలు అందించే టెలికాం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బాండ్విడ్త్ సౌకర్యం కలిగిస్తామని వివరించారు. టెలికాం కంపెనీలు సెకనుకు 2 మెగాబిట్ల వేగం ఉండేలా డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్టుతెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష