అన్ని పంచాయతీలకూ భారత్నెట్ రెండో దశ ప్రారంభం నేడు
- November 12, 2017
అన్ని పంచాయతీలకూ బ్రాడ్ బ్యాండ్ సేవల కల్పనే లక్ష్యంకేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడిఅమలుపై ఏపీ, తెలంగాణలతో ఒప్పందాలుదిల్లీ: అన్ని పంచాయతీలకూ హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ను కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన భారత్నెట్ ప్రాజెక్టు రెండో దశను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు రూ.34 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇది రెండో దశమాత్రమే కాకుండా తుది దశ అని కూడా తెలిపారు. 2019 మార్చి నాటికి దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాండ్ బ్యాండ్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అదనంగా 10 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ను వేయనున్నామని తెలిపారు. గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్, వైఫై సేవలు అందించే టెలికాం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బాండ్విడ్త్ సౌకర్యం కలిగిస్తామని వివరించారు. టెలికాం కంపెనీలు సెకనుకు 2 మెగాబిట్ల వేగం ఉండేలా డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్టుతెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







