భాగ్యనగరంలో మరో సంగీత విభావరి
- November 12, 2017
దక్షిణ భారతావనిలో ఘనమైన చరిత్ర కర్ణాటక సంగీతానిది. ఎందరో మహానుభావులు ఈ సాంస్కృతిక సంపదని సుసంపన్నం చేశారు. సంగీతానికి ఎంతో సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరున సంగీత ప్రియులందరికీ ఆవిడను స్మరించుకునే అవకాశం HTO CLUB కలిగించింది. సుగంధాల గానాలు వెదజల్లే ఈ మహత్తర కార్యక్రమానికి “సుస్వర” పేరట సంగీత విభావరి నిర్వహించనున్నారు.
ఈ “సుస్వర (Carnatic Fusion)” కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు లోని పది ప్రఖ్యాత సంగీతాలయాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ గాయనీ గాయకులు నిహాల్, శ్రీనిధి మరియు పృథ్వీచంద్రలు వారి గీతాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14న ఫీనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో సాయంత్రం 04:00 గం.ల నుండి మూడు గంటల పాటు ఈ సంగీత విభావరి కొనసాగనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష