ప్రతిపక్షం లేకుండా కూల్ కూల్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- November 12, 2017
శని ఆదివారం సెలవుల తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజుకొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. విజయవాడ కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నీటి పారుదల వ్యవస్థలను రైతులు నిర్వహించే చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లును సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవేశపెడతారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల చట్టానికి సవరణ బిల్లును హోం మంత్రి చిన రాజప్ప సభలో పెడతారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టానికి సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి లోకేశ్, నాలా పన్నుకు సంబంధించి సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెడతారు.
అసెంబ్లీలో నివేదికలు కూడా ప్రవేశ పెట్టనున్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కమిషన్కు సంబంధించిన వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులెవరూ సభకు హాజరు కాకపోవడంతో సమావేశాలు ప్రశాంతంగా కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









