ప్రతిపక్షం లేకుండా కూల్ కూల్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- November 12, 2017
శని ఆదివారం సెలవుల తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజుకొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. విజయవాడ కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నీటి పారుదల వ్యవస్థలను రైతులు నిర్వహించే చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లును సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవేశపెడతారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల చట్టానికి సవరణ బిల్లును హోం మంత్రి చిన రాజప్ప సభలో పెడతారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టానికి సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి లోకేశ్, నాలా పన్నుకు సంబంధించి సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెడతారు.
అసెంబ్లీలో నివేదికలు కూడా ప్రవేశ పెట్టనున్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కమిషన్కు సంబంధించిన వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులెవరూ సభకు హాజరు కాకపోవడంతో సమావేశాలు ప్రశాంతంగా కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో స్ట్రోక్తో చిక్కుకున్న హైదరాబాద్ ప్రవాసికి ఊరట.. కుటుంబంతో మళ్లీ కలిపిన యూసుఫ్ అలీ
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు
- పోస్టల్ సేవలపై జీఎస్టీ తొలగించాలి..కేంద్రాన్ని కోరిన ఎంపీ బాలశౌరి
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!







