రైతన్న ముందస్తు జాగ్రత్త
- November 13, 2017
ఒడిశా రాష్ట్రంలో రైతులు వరి కోత పనులు మొదలుపెట్టారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు రైతులు ముందస్తుగా వరి కోతలు చేపట్టారు. బంగాళాఖాతంలో నైరుతి దిశగా అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర ఉపరితలంపై 7.6 కిలోమీటర్ల మేర తుపాను ఏర్పడనుందని తెలిపింది.
ఈశాన్య దిశగా ఒడిశా తీరంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపింది. సముద్రం భీకరంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వెంటనే వరి కోతలు ప్రారంభించి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









