వ్యాయామం చేస్తూ మృతి చెందిన బహ్రెయినీ
- November 13, 2017
మనామా: ఓ వ్యక్తి వ్యాయామం చేస్తూ మృతి చెందిన ఘటన ఖాల్అత్ అల్ బహ్రెయిన్ (బహ్రెయిన్ ఫోర్ట్) వద్ద చోటు చేసుకుంది. బార్బర్ విలేజ్కి చెందిన ప్రముఖ ఇంజనీర్ అలీ అల్ షోవాయిక్గా మృతుడ్ని గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, ఉన్నపళంగా కుప్పకూపోలిపోయారు షోవాయిక్. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు పది మంది వ్యాయామం చేస్తూ, ఆటలు ఆడుతూ ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్తో షోవాయిక్ మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్ ఎయిడ్ ఎంతో ఉపకరిస్తుందనీ, ఉన్నపళంగా కుప్పకూలిపోయినవారికి అత్యవసరంగా వైద్య సహాయం అందిస్తే, ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









