హైఫా యుద్ధ స్మారక గీతం ఆవిష్కరణ
- November 14, 2017
ఇజ్రాయిల్: ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్ లో తన శాంతి సుహృద్భావ పర్యటనలో భాగంగా 1918 సంవత్సరంలో ఇజ్రాయిల్ లోని హైఫాలో జరిగిన యుద్ధంలో భారతీయ సైనికులు కమాండర్ ధళపత్ సింగ్, కెప్టన్ అమన్ సింగ్ లు చూపిన శౌర్యానికి, మన భారతీయ సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా హైఫా యుద్ద శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన హైఫా యుద్ద గీతాన్ని హైఫా సెక్రెటరీ జనరల్ బ్రాచా సెల హైఫా సిటీ హాల్ లో ఆ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవికుమార్ అయ్యర్, హాంగ్ కాంగ్, బ్రిగేడియర్ మహేంద్ర సింగ్ జోధా లు హైఫా సెక్రెటరీ జనరల్ బ్రాచా సెల ను సత్కరించారు.
ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హైఫా భారతీయ సైనికుల స్నేహానికి చిహ్నంగా “తీన్మూర్తి” స్థూపాన్ని హైఫా నగరంలో ఏర్పాటు చేయాలని హైఫా నగరంలో ప్రధాన కూడలిలకు కమాండర్ ధళపత్ సింగ్, కెప్టన్ అమన్ సింగ్ ల పేర్లను ఉంచాలని కోరారు. అనంతరం ఇండో- ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ ఫోరం సభ్యులు హైఫా యుద్ద స్మారక వీరుల చిహ్నం వద్ద పూల గుచ్చాన్ని, షాలువాను వుంచి భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు. ఆనాడు భారతీయ సైన్యం యొక్క వీరత్వాన్ని చాటిన కెప్టన్ అమన్ సింగ్ మనుమడు బ్రిగేడియర్ మహేంద్ర సింగ్ జోధా ను హైఫా విశ్వవిధ్యాలయ కౌన్సిలర్ ఇత్-అమర్ ధీయోడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







