ఉక్కపోత భరించలేక పెట్టుకున్న ఫ్యాన్లు ఊపిరి తీసాయి
- November 14, 2017
థాయ్లాండ్లోని చయాఫూమ్ ప్రావిన్స్కు చెందిన సొబ్తావీ (44) తాంబాన్ ముయాంగ్లోని తల్లి (86)ని చూసేందుకు వెళ్లాడు. ఆ రాత్రి అమ్మదగ్గరే ఉండి ఉదయాన్నే వెళదామని అనుకున్నాడు. అక్కడ వేడి ఎక్కువగా ఉండడంతో మూడు ఫ్యాన్లు పెట్టుకుని నిద్ర పోయాడు. అంతే తెల్లారిపాటికి శవమయ్యాడు. కారణమేమంటే అక్కడ పగటి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి రాత్రి పూట దారుణంగా పడిపోతుంటాయి. విషయం తెలియని సొబ్తావీ మూడు ఫ్యాన్లు ఆన్ చేసుకుని నిద్ర పోయాడు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడం దానికి తోడు అతడు కింద పడుకోవడంతో శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. తెల్లవారాక ఇంకా నిద్రలేవడం లేదని తల్లి వచ్చి చూసేసరికి శరీరమంతా చల్లబడి పోయిఉంది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు హైపోథెర్మియా (శరీరం బాగా చల్లబడిపోవడం) తో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







