యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించిన సౌదీ ప్రభుత్వం

- November 14, 2017 , by Maagulf
యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించిన సౌదీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: సౌదీ ప్రభుత్వం మంగళవారం యోగాపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. యోగాభ్యాసం అనేది ఒక క్రీడ.. దానిని అందరూ నేర్చుకోవచ్చు అంటూ సౌదీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యోగా శిక్షణలో లైసెన్స్‌ ఉన్న టీచర్ల వద్ద ఎవరైనా యోగా నేర్చుకోవచ్చని సౌదీ ప్రభుత్వం తెలిపింది. సౌదీ అరేబియాలో యోగా గుర్తింపు కోసం నూఫ్‌ మార్వాయి అనే మహిళ అనితర సాధ్యమైన పోరాటాన్ని నిర్వహించి విజయం సాధించింది. సౌదీలో మొదటి యోగా ట్రైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నూఫ్‌ మార్వాయి.. యోగాకు మతానికి సంబంధం లేదని మొదటి నుంచి వాదిస్తున్నారు. సౌదీ, గల్ఫ్‌ ప్రాంతాల్లో యోగా, ఆయుర్వేదాన్ని నూఫ్‌ చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం యూఫ్‌ను యోగాచారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com