ట్రావెల్ ఏజెన్సీలో దొంగతనం: 12 మందికి ట్రయల్
- November 14, 201712 మంది సభ్యులు గల ముఠాని దొంగతనం కేసులో ట్రయల్ ముందుంచారు. కత్తులతో బెదిరించి, ట్రావెల్ ఆఫీసులో 14,000 దిర్హామ్లు దొంగిలించిన కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఆసియాకి చెందిన వ్యక్తులు మొహానికి మాస్కులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో సహా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం ముసాఫ్ఫాలోని ఓ ట్రావెల్ ఆఫీసుపై దాడి చేసింది ఈ దొంగల ముఠా. దొంగతనంపై ఆ సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత నగదు, అలాగే కొన్ని మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిందితులు తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు. తదుపరి విచారణ డిసెంబర్కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన