తెలంగాణలో తెలుగు మహాసభలు

- November 15, 2017 , by Maagulf
తెలంగాణలో తెలుగు మహాసభలు

తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికి సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com