ఇవాంకా ట్వీట్.. స్పందించిన మోడీ
- November 15, 2017
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ తన భారత పర్యటనపై ఆత్రుతగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్లో జరిగే జీఈఎస్(గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సు)లో ఇవాంకా పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఈ విషయమై ఇవాంకా ట్రంప్ తాజాగా ఒక ట్వీట్ కూడా చేశారు. 'ప్రధాని మోడీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్యవేత్తలను కలుసుకునేందుకు వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది..' అని ఇవాంకా ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు.
దీనికి మన ప్రధాని మోడీ రీట్వీట్ చేస్తూ.. ఇవాంకాకు స్వాగతం పలికారు. 'మీ రాకతో రెండు దేశాల ఆర్థికబంధం బలపడుతుంది. భారత్లోని నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్యవేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం..' అని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష