కెనడా పేరుతో యువతులకు టోకరా
- November 16, 2017
హైదరాబాద్: కెనడా పంపిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఓ యువతి మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. నగరంలోని నేరేడ్మెట్ పోలీస్టేషన్ పరిధిలోగల రాంనగర్ లో నివాసముంటున్న హేమలత అనే యువతి దాదాపు 150 మంది తమిళనాడుకి చెందిన యువతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కెనడా దేశానికి పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే... ఎంతకూ తమను కెనడా పంపించకపోవడంతో అనుమానం వచ్చిన యువతునలు బుధవారం రాంనగర్ వచ్చారు.
తాము మోసానికి గురయ్యామన్న విషయాన్ని గుర్తించిన వారు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బుధవారం నుంచి పోలీస్స్టేషన్ పక్కన ఉండే ఓ పార్కులో ఉంటూ వారు ఇబ్బందుల పడుతున్నారు. కాగా తాము కట్టిన డబ్బులు మాకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష