కెనడా పేరుతో యువతులకు టోకరా
- November 16, 2017
హైదరాబాద్: కెనడా పంపిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఓ యువతి మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. నగరంలోని నేరేడ్మెట్ పోలీస్టేషన్ పరిధిలోగల రాంనగర్ లో నివాసముంటున్న హేమలత అనే యువతి దాదాపు 150 మంది తమిళనాడుకి చెందిన యువతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కెనడా దేశానికి పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే... ఎంతకూ తమను కెనడా పంపించకపోవడంతో అనుమానం వచ్చిన యువతునలు బుధవారం రాంనగర్ వచ్చారు.
తాము మోసానికి గురయ్యామన్న విషయాన్ని గుర్తించిన వారు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బుధవారం నుంచి పోలీస్స్టేషన్ పక్కన ఉండే ఓ పార్కులో ఉంటూ వారు ఇబ్బందుల పడుతున్నారు. కాగా తాము కట్టిన డబ్బులు మాకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







