కెనడా పేరుతో యువతులకు టోకరా
- November 16, 2017
హైదరాబాద్: కెనడా పంపిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఓ యువతి మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. నగరంలోని నేరేడ్మెట్ పోలీస్టేషన్ పరిధిలోగల రాంనగర్ లో నివాసముంటున్న హేమలత అనే యువతి దాదాపు 150 మంది తమిళనాడుకి చెందిన యువతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కెనడా దేశానికి పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే... ఎంతకూ తమను కెనడా పంపించకపోవడంతో అనుమానం వచ్చిన యువతునలు బుధవారం రాంనగర్ వచ్చారు.
తాము మోసానికి గురయ్యామన్న విషయాన్ని గుర్తించిన వారు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బుధవారం నుంచి పోలీస్స్టేషన్ పక్కన ఉండే ఓ పార్కులో ఉంటూ వారు ఇబ్బందుల పడుతున్నారు. కాగా తాము కట్టిన డబ్బులు మాకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







