దొంగల చేతిలో ఆవిరైన విద్యార్ధి ప్రాణం
- November 16, 2017
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ స్టోర్లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నలుగురు నలుగురు సాయుధ దుండగులు కలిసి ఈ విద్యార్థిని కాల్చివేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోసిటీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది.
ఫ్రెస్నోసిటీలోని గ్యాస్ స్టేషన్లో లూటీ చేసిన నలుగురు దుండగులు ఆ ప్రక్కనే ఉన్న జనరల్ స్టోర్లో క్యాష్ కౌంటర్ వెనుక భాగంలో ఉన్న 21 యేళ్ల ధర్మప్రీత్ సింగ్ జస్సార్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జస్సార్ నేలకొరిగాడు. మృతుడు పంజాబ్కు చెందిన విద్యార్థిగా గుర్తించారు.
ఇదిలావుండగా, ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేటట్లు చూడాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ కోరుతూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్.. .అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు ధర్మఫ్రీత్ సింగ్ జస్సార్ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







