ఎన్నారైలూ.. భారత్కు బంగారం తీసుకురావాలనుకుంటున్నారా?
- November 11, 2015
సాధారణంగా విదేశాల్లో ఉండే భారతీయులు స్వదేశానికి బంగారంతో వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గోల్డ్బార్స్, బంగారు ఆభరణాల విషయంలో ఎంత సుంకం చెల్లించాలనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. భారత్కు ఎన్ని కేజీల బంగారం తీసుకురావచ్చు, ఆభరణాలకు లభించే డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ వంటి విషయాల గురించి సమగ్ర కథనం.
1)విదేశాల నుంచి భారత్కు తీసుకువచ్చే గోల్డ్బార్స్కు ఎటువంటి జీరో డ్యూటీ ఉండదు. పాసింజర్లు భారత్కు తీసుకు వచ్చే గోల్డ్బార్స్పై నాలుగు శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. అలాగే టోలా బార్స్కు పది శాతం కట్టాలి.
2)ఇక బంగారు ఆభరణాలకు మాత్రం కొంతవరకు డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ ఉంటుంది. మగవారి రూ.50,000, ఆడవారికి రూ.లక్ష వరకు డ్యూటీ ఫ్రీ అలోయెన్స్ లభిస్తుంది. అయితే అనుమతించిన దాని కంటే ఎక్కువ విలువ గల బంగారాన్ని తీసుకువస్తే.. ఆ బంగారం విలువలో పది శాతం టాక్స్ కట్టాలి.
3)అలాగే గతంలో విదేశాల నుంచి భారత్కు పది కేజీల వరకు బంగారాన్ని తీసుకొచ్చే వీలుండేది. అయితే ఇటీవల మారిన నిబంధనల ప్రకారం భారత్కు తీసుకొచ్చే బంగారం కేజీకి మించకూడదు. అంతకుమించి ఎక్కువ ఉంటే ఆ బంగారాన్ని సీజ్ చేసి, ఆ ప్రయాణీకుడిని అరెస్టు చేస్తారు.
4)ఇక విదేశాల్లో జరిగే ఫంక్షన్లకు భారత్ నుంచి బంగారు ఆభరణాలు ధరించి వెళ్లేవారు కస్టమ్స్ అధికారుల నుంచి ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే తిరిగి భారత్కు వచ్చేటప్పుడు ఇబ్బందులు తప్పవు.
5)అనుమతించిన డ్యూటీ ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువ బంగారంతో వచ్చేవారు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ చానెల్ను ఉపయోగించకూడదు. ఒకవేళ చెకింగ్ జరిగి పట్టుబడితే జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







