ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన అధికారులు సస్పెండ్
- November 17, 2017కువైట్ : నిబంధనలు అమలులోకి వచ్చిన తరవాత ఉల్లంఘనలకు పాల్పడినవారిని ఊపేక్షించిన కొందరు అధికారులను జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు (జిటిడి) సస్పెండ్ చేయనుంది. వాహనాల డ్రైవర్లు సీట్ బెల్ట్లను ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవర్ మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే, వాహనాలను స్వాధీనం చేయకపోవచ్చని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ నిబంధన అమలులోనికి వచ్చిన 24 గంటల తర్వాత సరిగా చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేశారు. నివేదిక ప్రకారం, మొదటి 24 గంటల్లో పౌరులకు మరియు నివాసితులు చెందిన 1,000 కి పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు పార్లమెంట్ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో పైన పేర్కొన్న ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను చేజిక్కించుకోవడానికి అధికారులు అంతగా ఉత్సాహాన్ని చూపకుండా నిర్లక్ష్యంతో వదిలివేస్తున్నట్లు గుర్తించింది.కొందరు అధికారులకు ఈ నిబంధనల పట్ల అంతగా ఆసక్తి లేదు తెలుస్తోంది. అయితే మరికొందరు అధికారులు ఖచ్చితమైన విధానాలు అమలుచేయడంతో అనేక మంది పౌరులు,p ప్రవాసీయులు కారులను అద్దెకి ఇచ్చే కార్యాలయాల చుట్టూ మొదటి రోజున ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!