ఢిల్లీలో తెలంగాణ మేయర్ల బృందం
- November 17, 2017
నగరంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ కాంప్లెక్స్ను తెలంగాణ మేయర్ల బృందం పరిశీలించింది. డిజిటల్ హెల్త్ క్లినిక్, వెం డింగ్ మెషిన్, ఏటీఎం, మినరల్ వాటర్ మిషన్లను మేయర్లు ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధి కారులు తెలంగాణ మేయర్ల బృందానికి శుక్రవారం ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దేశంలో వివిధ పట్టణాల్లో పర్యటించి స్వచ్ఛత, పరిశురఽభత పనులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. హైటెక్ నర్సరీ, ఓపెన్ జిమ్, ల్యాండ్స్కేపింగ్ వంటివి తమను ఆకర్శి తుల్ని చేశాయని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ స్టడీ టూర్లో కీలక ప్రాజెక్టులను పరిశీలించామన్నారు. ఈ బృం దంలో మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు కరీం నగర్ మేయర్ రవీందర్ సింగ్, ఖమ్మం మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









