మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది

- November 17, 2017 , by Maagulf
మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది

హీరో శివాజీ నంది అవార్డ్స్ రగడ పై తనదైన స్టైల్ లో స్పందించాడు. అవార్డ్స్ విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగింది అన్న మాటలో నిజం ఉందని అన్నారు.. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని.. అటువంటి వారు అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి భజన చేస్తారు అని చెప్పాడు.. 
 
అసలు నంది అవార్డ్స్ కొందరి వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో ఇస్తే ఎటువంటి వివాదాలు ఏర్పడవు అని అన్నారు. తాను హీరోగా నటించిన మిసమ్మ సినిమాలో తన నటనకు గాను... ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని కొంతమంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా.. అప్పట్లో కొందరు తనకు అవార్డ్ రాకుండా అడ్డుకున్నారని శివాజీ గుర్తు చేసుకొన్నాడు. ఈ నంది అవార్డ్స్ పై టాలీవుడ్ లో అందరూ తలో విధంగా స్పందిస్తూ.. వివిధ వర్గాలుగా విడిపోయాయి.. అని అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com