డిస్నీల్యాండ్ లో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ...!!
- November 17, 2017
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే.. తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఇక షూటింగ్ కి గ్యాప్ దొరికితే.. భార్య పిల్లలతో.. విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారట. ఆయనతో పాటు.. నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. కాగా ఈ ట్రిప్ లో మహేష్ ఫ్యామిలీతో పాటు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నే కూడా తన కుటుంబంతో వెళ్ళినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో పాటు నవీన్ ఎర్నే పిల్లలు కలిసి పోయి.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.. రెండు కుటుంబాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతూ.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారట.. ట్రిప్ లో భాగంగా... డిస్నీల్యాండ్, టుమారో ల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటి వాటిని చుట్టేస్తున్నారు. కొన్ని ప్లేస్ లకు బై రోడ్ వెళ్లారట. రెండు రోజుల్లో తిరిగి ఇండియా రానున్న మహేష్ బాబు,... వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







