డిస్నీల్యాండ్ లో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ...!!
- November 17, 2017
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే.. తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఇక షూటింగ్ కి గ్యాప్ దొరికితే.. భార్య పిల్లలతో.. విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారట. ఆయనతో పాటు.. నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. కాగా ఈ ట్రిప్ లో మహేష్ ఫ్యామిలీతో పాటు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నే కూడా తన కుటుంబంతో వెళ్ళినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో పాటు నవీన్ ఎర్నే పిల్లలు కలిసి పోయి.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.. రెండు కుటుంబాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతూ.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారట.. ట్రిప్ లో భాగంగా... డిస్నీల్యాండ్, టుమారో ల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటి వాటిని చుట్టేస్తున్నారు. కొన్ని ప్లేస్ లకు బై రోడ్ వెళ్లారట. రెండు రోజుల్లో తిరిగి ఇండియా రానున్న మహేష్ బాబు,... వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









