డిస్నీల్యాండ్ లో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ...!!
- November 17, 2017
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే.. తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఇక షూటింగ్ కి గ్యాప్ దొరికితే.. భార్య పిల్లలతో.. విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారట. ఆయనతో పాటు.. నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. కాగా ఈ ట్రిప్ లో మహేష్ ఫ్యామిలీతో పాటు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నే కూడా తన కుటుంబంతో వెళ్ళినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో పాటు నవీన్ ఎర్నే పిల్లలు కలిసి పోయి.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.. రెండు కుటుంబాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతూ.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారట.. ట్రిప్ లో భాగంగా... డిస్నీల్యాండ్, టుమారో ల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటి వాటిని చుట్టేస్తున్నారు. కొన్ని ప్లేస్ లకు బై రోడ్ వెళ్లారట. రెండు రోజుల్లో తిరిగి ఇండియా రానున్న మహేష్ బాబు,... వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు