ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి

- November 18, 2017 , by Maagulf
ఐదేళ్ళ భారత చిన్నారి అబుదాబీలో మృతి

అబుదాబీలో ఐదేళ్ళ భారత చిన్నారి తీవ్రమైన జ్వరంతో ప్రాణాలు కోల్పోయింది. రయీసా అనే ఐదేళ్ళ బాలిక, అబుదాబీలోని మోడల్‌ స్కూల్‌లో కిండర్‌గార్టెన్‌ సెక్షన్‌లో విద్యాభ్యాసం చేస్తోంది. తల్లిదండ్రులకు ఆమె ఒకే ఒక్క కుమార్తె. కేరళలోని మలప్పురంకి చెందిన కుటుంబం, తమ బిడ్డను కోల్పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతురాలి తండ్రి రఫి, బనియాస్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్‌లో నివసిస్తున్నవారు అనేక అనారోగ్యాల బారినపడుతున్నారు. చిన్నారి రయీసా వారం రోజులపాటు జ్వరంతో బాధపడి, చివరికి మృత్యువాత పడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com