వాడి వరదలు: 5 మందిని సురక్షితం, ఒకరి మిస్సింగ్‌

- November 18, 2017 , by Maagulf
వాడి వరదలు: 5 మందిని సురక్షితం, ఒకరి మిస్సింగ్‌

వాడి వరదల్లో ఐదుగురు భారతీయులు కొట్టుకుపోతుండగా వారిని రక్షించారు. అయితే మరొకరు మాత్రం ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఈస్టర్న్‌ రీజియన్‌ పోలీస్‌ రెస్క్యూ యూనిట్‌ 18 ఏళ్ళ స్టూడెంట్‌ వరదల్లో గల్లంతయినట్లు తెలిపింది. ఎయిర్‌ వింగ్‌ పోలీస్‌తో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతయిన వ్యక్తిని ఆల్బర్ట్‌ జాయ్‌గా గుర్తించారు. వర్షాల్లో డ్రైవింగ్‌ని ఎంజాయ్‌ చేయడం కోసం అల్బర్ట్‌ రాయ్‌ తన స్నేహితులతో కలిసి వెళ్ళగా, దురదృష్టం వీరిని వెంటాడింది. భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఆకస్మిక వరదలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. అందులోంచి ఐదుగురు రక్షింపబడ్డారు. గల్లంతయిన వ్యక్తిని రస్‌ అల్‌ ఖైమాలోని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com