వాడి వరదలు: 5 మందిని సురక్షితం, ఒకరి మిస్సింగ్
- November 18, 2017
వాడి వరదల్లో ఐదుగురు భారతీయులు కొట్టుకుపోతుండగా వారిని రక్షించారు. అయితే మరొకరు మాత్రం ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ రెస్క్యూ యూనిట్ 18 ఏళ్ళ స్టూడెంట్ వరదల్లో గల్లంతయినట్లు తెలిపింది. ఎయిర్ వింగ్ పోలీస్తో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతయిన వ్యక్తిని ఆల్బర్ట్ జాయ్గా గుర్తించారు. వర్షాల్లో డ్రైవింగ్ని ఎంజాయ్ చేయడం కోసం అల్బర్ట్ రాయ్ తన స్నేహితులతో కలిసి వెళ్ళగా, దురదృష్టం వీరిని వెంటాడింది. భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఆకస్మిక వరదలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. అందులోంచి ఐదుగురు రక్షింపబడ్డారు. గల్లంతయిన వ్యక్తిని రస్ అల్ ఖైమాలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







