వాడి వరదలు: 5 మందిని సురక్షితం, ఒకరి మిస్సింగ్
- November 18, 2017
వాడి వరదల్లో ఐదుగురు భారతీయులు కొట్టుకుపోతుండగా వారిని రక్షించారు. అయితే మరొకరు మాత్రం ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ రెస్క్యూ యూనిట్ 18 ఏళ్ళ స్టూడెంట్ వరదల్లో గల్లంతయినట్లు తెలిపింది. ఎయిర్ వింగ్ పోలీస్తో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతయిన వ్యక్తిని ఆల్బర్ట్ జాయ్గా గుర్తించారు. వర్షాల్లో డ్రైవింగ్ని ఎంజాయ్ చేయడం కోసం అల్బర్ట్ రాయ్ తన స్నేహితులతో కలిసి వెళ్ళగా, దురదృష్టం వీరిని వెంటాడింది. భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఆకస్మిక వరదలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. అందులోంచి ఐదుగురు రక్షింపబడ్డారు. గల్లంతయిన వ్యక్తిని రస్ అల్ ఖైమాలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







