రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న శంకర్
- November 18, 2017
రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు. భారీ ఆశలతో ఎదురుచూస్తోన్న సినీలవర్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నాడు. టు పాయింట్ ఓ వస్తోంది, సూపర్ స్టార్ మేజిక్స్, శంకర్ మేకింగ్ తో థ్రిల్ అవుదామనుకున్న సిల్వర్ స్క్రీన్ ను నిరాశపరుస్తూ ఈసినిమా పోస్ట్ పోన్ అవుతోంది.
టు పాయింట్ ఓ జనవరి25న రిలీజ్ అవుతుందనగానే మరికొన్ని రోజుల్లో ఓ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ను చూడబోతున్నామని సినీజనాలంతా ఫిక్స్ అయ్యారు. శంకర్ 450కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తోన్న ఈసినిమా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ కూడా ఫిక్స్ అయ్యింది. పైగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈసినిమాకు వర్క్ చేస్తుండడంతో టు పాయింట్ ఓ, బాహుబలి రికార్డులను తిరగరాస్తుందనే టాక్ కూడా స్టార్ట్ అయ్యింది.
2డి, 3డిల్లో రూపొందుతోన్న ఈసినిమా లాంచింగ్ టైంలోనే హైప్స్ క్రియేట్ చెయ్యడం, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపిస్తుండడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పైగా ఐ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో శంకర్ టు పాయింట్ ఓ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన విజన్ తో సౌత్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో 2018జనవరి25ను ఇండియన్ సినిమా మార్క్ చేసి పెట్టుకుంది.
ఇండియన్ ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ఈ సినిమా జనవరి25కి రిలీజ్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే గ్రాఫికల్ వర్క్ ఇంకా బాలెన్స్ ఉందట. హై గ్రాఫికల్ వండర్ ను అందించాలనుకుంటోన్న శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడట. పర్ఫెక్ట్ అవుట్ పుట్ నే ప్రేక్షకుల మందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. సో ఈసినిమా రిపబ్లిక్ డే నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ అవుతుందట. అందుకే అక్షయ్ కుమార్ తన పాడ్ మాన్ ను జనవరి26న రిలీజ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









