పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం
- November 18, 2017
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో గోఎయిర్కు చెందిన విమానం వెనక్కి వచ్చింది. న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పట్నా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. న్యూదిల్లీలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు గోఎయిర్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని తిరిగి పైలట్ దింపివేసినట్లు పేర్కొంది. ఆ సమయంలో 174 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను వెంటనే మరో విమానంలో పట్నా తరలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







