రాజమౌళి మరో మల్టీస్టారర్.!
- November 18, 2017
'బాహుబలి' దర్శకధీరుడు రాజమౌళి ఈసారి తీయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆయన మల్టీస్టారర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించనున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని చిత్రవర్గాలు సోషల్మీడియా ద్వారా వెల్లడించాయి. 2018 మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి.. చరణ్, తారక్తో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. మల్టీస్టారర్ రాబోతోందన్న వార్త సోషల్మీడియాలో రాగానే అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే సినిమాకు టైటిళ్లు, బడ్జెట్, వసూళ్ల గురించి అంచనాలు వేసేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









