రాజమౌళి మరో మల్టీస్టారర్.!
- November 18, 2017
'బాహుబలి' దర్శకధీరుడు రాజమౌళి ఈసారి తీయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆయన మల్టీస్టారర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించనున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని చిత్రవర్గాలు సోషల్మీడియా ద్వారా వెల్లడించాయి. 2018 మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా రాజమౌళి.. చరణ్, తారక్తో కలిసి ఆప్యాయంగా దిగిన ఫొటో ఒకటి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. మల్టీస్టారర్ రాబోతోందన్న వార్త సోషల్మీడియాలో రాగానే అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి నుంచే సినిమాకు టైటిళ్లు, బడ్జెట్, వసూళ్ల గురించి అంచనాలు వేసేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







