పరారీలో వెనిజులా ప్రతిపక్ష నేత ఆంటానియో లెదెజ్మా
- November 18, 2017
ప్రభుత్వంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గృహనిర్బంధం ఎదుర్కొంటున్న వెనిజులా ప్రతిపక్ష నేత ఆంటానియో లెదెజ్మా శుక్రవారం పరారయ్యారు. సరిహద్దు గుండా ఆయన కొలంబియాకు పారిపోయారు. కొలంబియా సరిహద్దు నగరం కుకుతా సమీపంలోని వంతెన దాటడానికి ముందు మీడియాతో మాట్లాడారు. ''నేను ఎక్కడికి వెళ్లానో తెలీక నా కుమార్తె, భార్య చాలా ఆందోళన చెంది వుంటారు. వారు నన్ను అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. కొలంబియాకు వెళ్లాలనేది పూర్తిగా నా సొంత నిర్ణయం'' అని చెప్పారు. తిరుగుబాటు ఆరోపణల నేపథ్యంలో లెదెజ్మాను 2015 నుంచీ కారకాస్లో గృహనిర్బంధంలో వుంచిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కొలంబియాకు పారిపోయిన ఆయన రాత్రికిరాత్రే స్పెయిన్కు వెళ్లే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఆయన పరారీపై వెనిజులా అధ్యక్షుడు మదురో స్పందించారు. ''ఆ రక్తపిపాసిని కొలంబియా స్నేహితులు మళ్లీ వెనక్కి పంపించరనే ఆశిస్తున్నాను'' అని వ్యాఖ్యానించారు. మాడ్రిడ్ నగరంలో 'రక్తపిపాసి' తిరుగుతోందని, నగర ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని మదురో విమర్శించారు.
తాజా వార్తలు
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..









