హైదరాబాద్‌లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

- November 19, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పీపుల్స్‌ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. తరువాత గాంధీభవన్‌, ఇందిరా భవన్‌లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు కేక్‌ కట్ చేశారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో.. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్‌, కేవీపీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com