అదృశ్యమైన జలాంతర్గామి నుంచి 7 మిస్డ్ కాల్స్
- November 19, 2017
బ్యూనస్ ఎయిర్స్ : దక్షిణ అట్లాంటిక్లో అదృశ్యమైన అర్జంటైనా జలాంతర్గామి నుంచి 7 శాటిలైట్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. వేర్వేరు స్థావరాలకు ఈ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 15న ఈ జలాంతర్గామి అదృశ్యమైంది. దీనిలో 44 మంది సిబ్బంది ఉన్నారు.
అర్జంటైనా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ 7 శాటిలైట్స్ కాల్స్ నేవీ బేసెస్తో అనుసంధానం కాలేదని తెలుస్తోంది. కానీ జలాంతర్గామిలోని సిబ్బంది సంబంధాలను పునరుద్దరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్లో ప్రత్యేకతగల అమెరికా కంపెనీ సహకారంతో ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 15 ఉదయం 10.52 గంటల నుంచి మధ్యాహ్నం 3.42 గంటల మధ్యలో ఈ సిగ్నల్స్ వచ్చాయి. జలాంతర్గామి చివరిసారి దక్షిణ పటగోనియాలోని శాన్ జోర్జ్ గల్ఫ్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









