యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత
- November 19, 2017జెడ్డా : పురాతన చమురు శుద్ధి కర్మాగారం మూతపడింది. పర్యావరణ సమస్య ఉండటంతో జెట్డాలో రోజుకు 90,000 బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసే సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ కర్మాగారాన్ని నిరవధికంగా మూసివేశారు. జెడ్డాకు చెందిన పారిశ్రామిక వర్గాల సమాచారం మేరకు ఈ సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ కర్మాగారం కాలం చెల్లడం మరియు పర్యావరణv ఆందోళనల కారణంగా రిఫైనరీని మూసివేయడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1967 లో ఆరంభమైన ఈ చమురుశుద్ధి కర్మాగారం దేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం తన విలువైన సేవలను అందించింది. ఈ మూసివేత కారణంగా ఇతర సౌదీ చమురుశుద్ధి కర్మాగారాల వద్ద డిమాండ్ పెరుగుతుంది. సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ ద్రవీకృత పెట్రోలియం వాయువు, గ్యాసోలిన్, డీజిల్, తారు మరియు జెట్ ఇంధనం మరియు నఫ్తాలను సమర్ధవంతంగా ఎగుమతి చేసింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!