చింతచిగురు పులిహోర
- November 19, 2017
కావలసినవి: బియ్యం - 2 కప్పులు, చింతచిగురు - కప్పు, శనగపప్పు - టేబుల్ స్పూన, మినప్పప్పు - టేబుల్ స్పూన, ధనియాలు - టేబుల్ స్పూన, ఎండుమిర్చి - 4, నువ్వులు - టేబుల్ స్పూన, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు.
తయారీ: చింత చిగురును శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. వీలైతే కాస్త ఎండలో పెడితే మంచిది. తరువాత కాస్త నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు వేసి వేయించాలి. చివరగా ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించాలి. చల్లారిన తర్వాత వీటితోపాటు చింతచిగురు కూడా మిక్సీలో వేసి పొడి చేసి ఉంచాలి. అన్నం ఉడికించి ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత చింతచిగురు పొడి, ఉప్పు, కరివేపాకు వేసి ఓ నిమిషం వేగాక ఉడికించిన అన్నం వేసి కలిపి దించాలి. అంతే, టేస్టీ టేస్టీ పులిహోర రెడీ!
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









