అమరావతిలో సందడిచేసిన దీపికా పదుకొనే, రానా
- November 19, 2017విజయవాడలో తారలు తళుక్కు మన్నారు. సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా సందడి చేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది.
ఏపీ పర్యాటక శాఖ సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డ్ను దీపికా దీపికా పదుకొనే అందుకోగా.. మోస్ట్ యాక్టివ్ సౌత్ ఇండియన్ యాక్టర్ అవార్డును దగ్గుబాటి రానా అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అవార్డ్ అనిరుధ్ కు దక్కింది. వీరికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అవార్డులు ప్రదానం చేశారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దీపికాకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత విజయవాడలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు. సెలబ్రిటీలను చూసేందుకు తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి