అమరావతిలో సందడిచేసిన దీపికా పదుకొనే, రానా
- November 19, 2017
విజయవాడలో తారలు తళుక్కు మన్నారు. సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా సందడి చేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది.
ఏపీ పర్యాటక శాఖ సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డ్ను దీపికా దీపికా పదుకొనే అందుకోగా.. మోస్ట్ యాక్టివ్ సౌత్ ఇండియన్ యాక్టర్ అవార్డును దగ్గుబాటి రానా అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అవార్డ్ అనిరుధ్ కు దక్కింది. వీరికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అవార్డులు ప్రదానం చేశారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దీపికాకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత విజయవాడలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు. సెలబ్రిటీలను చూసేందుకు తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష