నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలికిన లండన్

- November 12, 2015 , by Maagulf
నరేంద్రమోదీకి ఘన స్వాగతం పలికిన లండన్

మూడు రోజుల యూకే పర్యటనలో భాగంగా బయలుదేరిన భారత ప్రధాని నరేంద్రమోదీ లండన్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్న మోదీని ఏయిర్ పోర్టులో అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వాణిజ్య, ఆర్థిక, రక్షణ, విద్యుత్ రంగాల అభివృద్ధితోటు ఉగ్రవాదం, వాతావరణంలో మార్పుపైనా ఇంగ్లాండ్ ప్రధాని డెవిడ్ కెమెరూన్ తో చర్చించనున్నారు. దశాబ్దం తర్వాత యూకేలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని అయిన మోదీ.. ఆర్థిక సహకారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పర్యటనలో మోదీ.. బ్రిటన్ ప్రధాని కెమెరూన్ తో చర్చలతో పాటు.. బ్రిటన్ పార్లమెంటులో, ప్రవాస భారతీయులు వెంబ్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ప్రసంగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com