నడుం నొప్పి వేధిస్తే ఇలా చేయండి..
- November 20, 2017గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? నడుం నొప్పి వేధిస్తుందా? అయితే గోరువెచ్చటి నూనెతో నడుమూ, వెన్ను ప్రాంతాల్లో నెమ్మదిగా మర్దనా చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పితోపాటూ ఒత్తిడి కూడా తగ్గుతుంది.
నొప్పి తగ్గేవరకు ప్రతిరోజూ కొన్ని వారాలపాటు చేయాలి. సరైన పద్ధతిలో పడుకోకపోవడం వల్ల కూడా వెన్నునొప్పి బాధిస్తుంది. ఒకవేళ మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే మీ మోకాళ్ల కింద తలగడను తప్పకుండా పెట్టుకోవాలి. ఒకవైపు తిరిగి పడుకోవాలనుకుంటే రెండు మోకాళ్లను మడిచి వాటి మధ్యలో తలగడను పెట్టుకోవాలి.
వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి కాపడం పెట్టుకోవడం వల్ల నడుం నొప్పి చాలామటుకూ అదుపులోకి వస్తుంది. కొన్ని ఐసు ముక్కలను లేదా చల్లటి కూరగాయల ప్యాకెట్ను ఒక తువాలులో చుట్టి దాంతో నడుంపై నెమ్మదిగా 15-20 సార్లు రుద్దినట్టు చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. చిన్నచిన్న వ్యాయామాలు కూడా నడుము నొప్పిని చాలామటుకూ అదుపులోకి తెస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్