స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ!

- November 21, 2017 , by Maagulf
స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ!

పాట్న: బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం స్కూల్ టీచర్లకు ఓ విచిత్రమైన డ్యూటీ వేసింది. బహిరంగ విసర్జనకు వెళ్లేవారిని ఓ కంట కనిపెట్టాలని ఆదేశించింది. మరుగుదొడ్లు వినియోగించకుండా బహిరంగంగా పనికానిచ్చే వారిని ఫోటోలు తీయాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు అన్ని బ్లాకుల్లోని విద్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం టీచర్లు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఎవరెవరు చెంబు పట్టుకుని వెళ్తున్నారో కాపలా కాయాల్సిఉంటుంది. అధ్యాపకులు ఈ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపల్స్‌కు అప్పగించారు.
వృత్తికి సంబంధంలేని డ్యూటీలు చేయాలంటూ బీహార్ ప్రభుత్వం అక్కడి టీచర్లను ఆదేశించడం ఇదేం కొత్తకాదు. గతంలో జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల డ్యూటీలు, ఓటర్ల జాబితా సరిచూడడం సహా పలు కార్యక్రమాల్లో ఉపాధ్యాయులే విధులు నిర్వహించాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com