స్కూల్ టీచర్లకు సర్కారు ఊహించని డ్యూటీ!
- November 21, 2017
పాట్న: బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం స్కూల్ టీచర్లకు ఓ విచిత్రమైన డ్యూటీ వేసింది. బహిరంగ విసర్జనకు వెళ్లేవారిని ఓ కంట కనిపెట్టాలని ఆదేశించింది. మరుగుదొడ్లు వినియోగించకుండా బహిరంగంగా పనికానిచ్చే వారిని ఫోటోలు తీయాలని హుకుం జారీచేసింది. ఈ మేరకు అన్ని బ్లాకుల్లోని విద్యాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం టీచర్లు రెండు షిఫ్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఎవరెవరు చెంబు పట్టుకుని వెళ్తున్నారో కాపలా కాయాల్సిఉంటుంది. అధ్యాపకులు ఈ డ్యూటీలు సరిగ్గా చేస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతలను స్కూల్ ప్రిన్సిపల్స్కు అప్పగించారు.
వృత్తికి సంబంధంలేని డ్యూటీలు చేయాలంటూ బీహార్ ప్రభుత్వం అక్కడి టీచర్లను ఆదేశించడం ఇదేం కొత్తకాదు. గతంలో జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల డ్యూటీలు, ఓటర్ల జాబితా సరిచూడడం సహా పలు కార్యక్రమాల్లో ఉపాధ్యాయులే విధులు నిర్వహించాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









