ఫాస్ ఆధ్వర్యంలో ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం
- November 23, 2017హైదరాబాద్: ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ(ఫాస్) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఫాస్ - అక్కినేని, సిల్వర్ క్రౌన్ ఫిలిం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు సాయికుమార్కు అభినందన పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీ దర్శకురాలు బి జయకు ఫాస్ సిల్వర్క్రౌన ఫిలిం అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాట్నా హైకోర్టు పూర్వ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకులకు సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సన్మానించుకోవడం విశేషం అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పి. విజయబాబు, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సంస్థ నిర్వాహకులు డా. కె ధర్మారావు, సినీనటులు పృథ్వి, ప్రణతి, జయదేవ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి