ఫాస్ ఆధ్వర్యంలో ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం
- November 23, 2017
హైదరాబాద్: ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ(ఫాస్) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఫాస్ - అక్కినేని, సిల్వర్ క్రౌన్ ఫిలిం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు సాయికుమార్కు అభినందన పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీ దర్శకురాలు బి జయకు ఫాస్ సిల్వర్క్రౌన ఫిలిం అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాట్నా హైకోర్టు పూర్వ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకులకు సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సన్మానించుకోవడం విశేషం అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పి. విజయబాబు, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సంస్థ నిర్వాహకులు డా. కె ధర్మారావు, సినీనటులు పృథ్వి, ప్రణతి, జయదేవ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







