ఫాస్ ఆధ్వర్యంలో ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం
- November 23, 2017
హైదరాబాద్: ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రిసియేషన్ సొసైటీ(ఫాస్) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఫాస్ - అక్కినేని, సిల్వర్ క్రౌన్ ఫిలిం అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు సాయికుమార్కు అభినందన పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీ దర్శకురాలు బి జయకు ఫాస్ సిల్వర్క్రౌన ఫిలిం అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాట్నా హైకోర్టు పూర్వ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకులకు సందేశంతో పాటు వినోదాన్ని అందిస్తున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను, దర్శకులను సన్మానించుకోవడం విశేషం అన్నారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్ పి. విజయబాబు, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సంస్థ నిర్వాహకులు డా. కె ధర్మారావు, సినీనటులు పృథ్వి, ప్రణతి, జయదేవ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







