మనామా: చైనీస్‌ ఎంబసీ కోసం శంకుస్థాపన

- November 24, 2017 , by Maagulf
మనామా: చైనీస్‌ ఎంబసీ కోసం శంకుస్థాపన

మనామా: ఫారిన్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా, చైనా రాయబారి కి జోన్‌హాంగ్‌ సంయుక్తంగా చైనీస్‌ ఎంబసీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన షేక్‌ ఖాలిద్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా మెరుగైన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. చైనాలో కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా చైనా రాయబారి, షేక్‌ ఖాలిద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com