మణిరత్నంతో 14వ సారి పనిచేస్తున్నఏఆర్
- November 24, 2017
ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకి అందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం. వచ్చే ఏడాది జనవరిలో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ని సెట్స్పైకి తీసుకెళ్ళనున్నాడు మణిరత్నం. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందనుంది. యాక్షన్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జ్యోతిక, ఐశ్వర్య రాజేష్లు కూడా కీలక పాత్రలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడని టీం సభ్యుల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే గోవాలో వీరిద్దరు కలిసి సాంగ్స్ కంపోజింగ్ మొదలు పెట్టారట. మణిరత్నంతో పనిచేయడం ఇది ఏఆర్ రెహమాన్కి 14వ సారి అని తెలుస్తుంది.
మణిరత్నం- అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన రోజా, దళపతి, బొంబాయి మరియు కాదల్ వంటి హిట్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విజయ్ సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ లతో పనిచేయడం మణిరత్నంకిదే తొలిసారి. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నాడు. భర్త మరణం తర్వాత తొలి సారి సహజ నటి జయసుధ ఈ చిత్రంలో నటిస్తుంది. నేచురల్ స్టార్ నాని కూడా మణిరత్నం మల్టీ స్టారర్ లో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









