రాజశేఖర్ కూతురు డాక్టర్ సీట్ కోసం సాయం అందించిన మెగాస్టార్
- November 24, 2017
టాలీవుడ్ లో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి... కొన్నేళ్ళ పాటు అలా కొనసాగిన మాట వాస్తవం. కాగా ఇటీవల రాజశేఖర్ రగుడవేగ సినిమా రిలేజ్ సందర్భంగా చిరంజీవిని రాజశేఖర్ దంపతులు కలుసుకొని సినిమా చూడడానికి ఆహ్వానించడంతో వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయబేధాలు తొలగిపోయాయి అని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయం పై రాజశేఖర్ స్పందిస్తూ... తామిద్దరం కొత్తగా కలుసుకొన్నది ఏమీ లేదని.. తమ మధ్య ఎప్పుడో అభిప్రాయబేధాలు తొలగిపోయి.. స్నేహసంబంధాలు నెలకొన్నాయని రాజశేఖర్ తెలిపాడు. ఇటీవల రాజశేఖర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గతంలో తన కూతురు మెడికల్ సీటు కోసం తాను చిరంజీవి ఇంటికి వెళ్ళినట్లు తెలిపాడు. చిరంజీవి గారితో విబేధాలు వచ్చాక కొంత కాలం దూరంగా ఉన్నాము.. కానీ అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లో కలుస్తూనే ఉన్నాము. మేము సైతం వంటి ఫంక్షంలో కలిశాం... మా అమ్మాయి శివానికి మెడికల్ సీటు కోసం అపోలో మెడికల్ కాలేజీ లో ధరఖాస్తు చేశాం. ఈ విషయంపై జీవిత చిరంజీవి గారి ఇంటికి వెళ్లింది. జీవిత వెళ్ళగానే చిరంజీవి గారు నా గురించి అడిగారాట.. వెంటనే జీవిత నాకు ఫోన్ చేసి రమ్మనమని చెప్పింది. కానీ అప్పటికి నేను రెడీగా లేను.. దీంతో జీవిత వెనక్కి వచ్చి.. నన్ను చిరంజీవి గారి ఇంటికి తీసుకొని వెళ్లింది. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడారు.. శివాని సీటుకు అవసరమైన సాయం కూడా చేశారు. అప్పటి నుంచి మా మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగి.. మరింత దగ్గర అయ్యాం.. అంతేకాదు.. గరుడ వేగ సినిమా సమయంలో కూడా చాలా సాయం అందించారు చిరంజీవి అని రాజశేకఃర్ తెలిపాడు. కాగా ఇప్పటికే రాజశేఖర్ తాను విలన్ పాత్రలకు అయినా ఒకే.. అని.. చిరంజీవి సినిమాలో విలన్ గా నటిస్తా అని ప్రకటించిన నేపద్యంలో త్వరలో మళ్ళీ రాజశేఖర్ వెండి తెరపై బిజీ అవుతాడేమో చూడాలి మరి.!!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష