భారీ పేలుడు..ఇద్దరు మృతి

- November 26, 2017 , by Maagulf
భారీ పేలుడు..ఇద్దరు మృతి

బీజింగ్ : చైనా ఈస్ట్ జిజియాంగ్ ప్రావిన్స్‌లోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడులో ఇద్దరు మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి కొన్ని భవనాల పైకప్పు కుప్పకూలిపోయాయి. మరికొన్ని ఇండ్లలో కిటికీలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com