దుబాయ్ ప్రయాణమవ్వనున్న బాలకృష్ణ-నయన్ జోడీ
- November 26, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా కోసం బాలయ్యతో పాటుగా నయనతార దుబాయ్ వెళ్లనుందట. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'జై సింహా'. చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్లో ఉంది.
అయితే ఈ షెడ్యూల్ను దుబాయ్లో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు దుబాయ్లో ఈ షెడ్యూల్ జరగనుంది. అక్కడ బాలకృష్ణ-నయనతార లపై ఓ పాటను, బాలకృష్ణ- నటాషా లపై మరో పాటను చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ పూర్తయితే షూటింగ్ అంతా పూర్తయినట్లే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







