దుబాయ్ ప్రయాణమవ్వనున్న బాలకృష్ణ-నయన్ జోడీ
- November 26, 2017
నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా కోసం బాలయ్యతో పాటుగా నయనతార దుబాయ్ వెళ్లనుందట. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య 102వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం 'జై సింహా'. చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ మాత్రమే పెండింగ్లో ఉంది.
అయితే ఈ షెడ్యూల్ను దుబాయ్లో ప్లాన్ చేసింది చిత్రయూనిట్. డిసెంబర్ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు దుబాయ్లో ఈ షెడ్యూల్ జరగనుంది. అక్కడ బాలకృష్ణ-నయనతార లపై ఓ పాటను, బాలకృష్ణ- నటాషా లపై మరో పాటను చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటల షూటింగ్ పూర్తయితే షూటింగ్ అంతా పూర్తయినట్లే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 12న విడుదలకానుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







